Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ జగన్.. మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదు : ఏపీ హోం మంత్రి అనిత

వరుణ్
ఆదివారం, 21 జులై 2024 (15:23 IST)
మిస్టర్ జగన్... అసత్య ప్రచారాలు చేస్తున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదూ అంటూ ఏపీ హోం మంత్రి అనిత ప్రశ్నించారు. నిత్యం ప్రభుత్వంపై బురద చల్లడానికి వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 'నాలుగు రాజకీయ హత్యలు జరిగాయి. వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్‌ ఆరోపించారు. 
 
ఆయన వద్ద వివరాలు ఉంటే నాకు సమాచారం ఇవ్వాలి. సమాచారం లేకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు. ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతారని భావిస్తున్నారా? గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే వేధించారు. గతంలో పెట్టిన కేసులపై బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్‌ చెబుతున్నారు. అధికారం కోల్పోయిన నెల రోజులకే ఆయన మైండ్‌ పనిచేయట్లేదు' అని అనిత ప్రశ్నించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments