Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలోనే ఏపీ హైకోర్టు? అందుకే రూ.25 కోట్ల‌తో టెండ‌ర్!

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (13:16 IST)
ఏపీలో మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్ మారుతోందా? ప‌రిపాల‌నా రాజ‌ధాని సంగ‌తి ఎలా ఉన్నా...ముఖ్యంగా హైకోర్టు అమ‌రావ‌తిలోనే కొన‌సాగ‌నుందా? అమ‌రావ‌తిలో 25 కోట్ల‌తో అద‌న‌పు హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి టెండ‌ర్లు పిల‌వడాన్ని చూస్తే, ఇది నిజ‌మే అనిపిస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తీసుకున్న ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నిర్ణయం మూడు రాజధానులు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని సీఎం జగన్ 2019 డిసెంబర్ లో జరిగిన శీతాకాల శాసనసభ సమావేశాల చివరి రోజున ప్రకటించారు.

ఇందులో భాగంగానే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఈ ప్రకటనపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినప్పటికీ... అధికార పార్టీ నేతలు మాత్రం సంబరాలు జరుపుకున్నారు. అటు ఇదే అంశంపై న్యాయస్థానాల్లో కేసులు కూడా దాఖలయ్యాయి. ఇక రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ 600 రోజులు పైగా రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మూడు రాజధానుల వ్యవహారంపై వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో పాటు... అధికారులు కూడా పలు మార్లు స్పష్టం చేశారు. త్వరలోనే విశాఖ నగరం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని కూడా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఇదే విషయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగానే ఉంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్... తన ప్రసంగంలో 3 రాజధానుల గురించి కనీసం ప్రస్తావించలేదు.

ఇప్పుడు హైకోర్టు నిర్మాణం విషయంలో అమరావతి మెట్రో రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ మరోసారి తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అమరావతిలోని నేలపాడులో హైకోర్టు శాశ్వత భవనం నిర్మించేందుకు ఏఎంఆర్డీఏ టెండర్లు పిలిచింది. మొత్తం 29 కోట్ల రూపాయలతో 3 అంతస్థుల భవనం నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించింది.

అయితే పునాదులు మాత్రం 5 అంతస్తుల భవనానికి అనుగుణంగా ఉండేలా నిర్మించాలని సూచించారు. న్యాయ రాజధానిగా కర్నూలు నగరం ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం... అమరావతిలోని నేలపాడులో శాశ్వత హైకోర్టు భవనం నిర్మించేందుకు టెండర్లు పిలవడం సర్వత్రా ఆసక్తిగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments