Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు : హైకోర్టు ఆదేశం

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (17:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ ఆదేశాలు ఏపీ సర్కారుకు ఊరట కలిగించేలా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్‌కు అంతరాయం కలగరాదనీ, ప్రజాసంక్షేమం దృష్ట్యా వీటిని నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
ఇటీవల ఎస్ఈసీ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు స్థానిక ఎన్నికలు అడ్డొస్తాయని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ నిలిపివేశామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
 
విచారణ సందర్భంగా ఎస్ఈసీ నిర్ణయాలను న్యాయస్థానం తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని అభిప్రాయపడింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, స్థానిక ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించడం కష్టసాధ్యమని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏజీ రెండు గంటల పాటు వాదనలు వినిపించారు. కాగా, హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని ఎస్ఈసీ నిర్ణయించినట్టు సమాచారం. ఏపీలో పంచాయతీ ఎన్నికల కోసం ఈ నెల 8న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ రిలీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments