Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులను కంట్రోల్ చేయలేకపోతే రిజైన్ చేయాలి : హైకోర్టు సీరియస్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (15:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ బాస్‌పై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు తీవ్రఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసులను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ పదవికి రాజీనామా చేయాలంటూ ఒకింత కన్నెర్రజేసింది. 
 
ఏపీ హైకోర్టు ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. దీనిపై బాధితుడి మేనమామ సుంకర నారాయణ స్వామి హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయడం జరిగింది. ఆ తర్వాత పిటిషనరు పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. 
 
ఈ వెంకటరాజు అదృశ్యం కేసులో పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. గతంలో మూడు కేసుల్లో జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని.. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యనించింది. అలాగే ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
అంతేకాకుండా, గతంలో పలుమార్లు డీడీపీని కోర్టుకు పిలిపించినా ఏమాత్రం మార్పు రాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు.. పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు కన్నెర్రజేసింది. పనిలోపనిగా, ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పుతుందని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments