Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్షేమ పథకాల నిధుల విడుదల పిటిషన్లపై తీర్పు రిజర్వు!

ఠాగూర్
గురువారం, 9 మే 2024 (17:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఎం జగన్ సర్కారు ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరగా, ఈసీ పర్మిషన్ నిరాకరించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పథకాల నిధుల విడదల ఆపేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి.
 
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మరోసారి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ అభ్యంతరాలకు సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా... ఈసీ నేడు సమాధానం ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
 
కాగా, జనవరి - మార్చి మధ్యలో పథకాలకు బటన్లు నొక్కి అప్పుడే నిధులు విడుదల చేయకుండా, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎలా నిధులు విడుదల చేస్తారని గురువారం విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. సైలెంట్ పీరియడ్‌లో నిధుల విడుదలకు అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. 
 
అందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది బదులిస్తూ... తామేమీ కొత్త పథకాలు ప్రకటించలేదని, ఎప్పటినుంచో నడుస్తున్న పథకాలకు మాత్రమే నిధులు విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు. అందుకు, ఈసీ తరపు న్యాయవాది స్పందిస్తూ... ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక జూన్ ఆరో తేదీన నిధులు విడుదల చేసుకోవాలని గతంలో తాము చెప్పామని, ఇప్పుడు పోలింగ్ పూర్తయ్యాక నిధులు విడుదల చేసుకోవచ్చని చెబుతున్నామని చెప్పడంతో కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments