Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు.. త్వరలో లండన్ టూర్

ఠాగూర్
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (15:32 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయన పాస్ పోర్టును ఐదేళ్లకాలపరిమితితో పునరుద్ధరించాలని ఆదేశించింది. దీంతో జగన్ దంపతులు తలపెట్టిన లండన్ పర్యటనకు ఉన్న పాస్ పోర్ట్ అడ్డంకులు తొలగిపోయాయి. 
 
జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు డిప్లొమాటిక్ పాస్ పోర్టు ఉండేది. అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో నిబంధనల మేరకు ఆయన డిప్లొమాటిక్ పాస్ పోర్టు రద్దు కావడంతో సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఐదేళ్ల కాలపరిమితితో జనరల్ పాస్ పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ నగరంలోని సీబీఐ కోర్టు ఆదేశించింది. కానీ, విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ పాస్ పోర్టు కాలపరిమితిని ఒక యేడాదికి మాత్రమే కుదిస్తూ, పలు షరతులు విధించింది. దీనిపై జగన్ హైకోర్టును ఆశ్రయించడంతో ఐదేళ్ల గడువుతో జగన్‌కు పాస్ పోర్టు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments