Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుయా ఆస్పత్రి ఘటనపై ఏపీ సర్కారుకు నోటీసు

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (18:26 IST)
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మరణించడానికి కారణమైన ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై హైకోర్టు స్పందించింది. 
 
ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, డీఎంహెచ్‌వో, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. 
 
ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె .లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. అలాగే, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. మరోవైపు, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments