Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు భారీ ఊరట...

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (13:09 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరుచేసింది. ఈ కేసులో గత ఐదేళ్ళుగా కోడికత్తి శ్రీను జైలులో మగ్గిపోతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గత నెల 24వ తేదీన విచారణ జరిపిన హైకోర్టు... తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ తీర్పును గురువారం ప్రకటించింది. పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 
 
ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడరాదని, రూ.25 వేల పూచీకత్తుపై రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో హజరై సంతకం చేయాలని, ర్యాలీల్లో పాల్గొనరాదని తదితర షరతులు విధించింది. కాగా, హైకోర్టు తీర్పుపై దళిత, పౌర హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే, ఈ కేసులో వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో సాక్షిగా ఉన్న విషయం తెల్సిందే. అయితే, ఆయన సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు రాకపోవడంతో కోడికత్తి దాడి కేసులో శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరులో తీవ్ర జాప్యం నెలకొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments