Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు భారీ ఊరట...

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (13:09 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరుచేసింది. ఈ కేసులో గత ఐదేళ్ళుగా కోడికత్తి శ్రీను జైలులో మగ్గిపోతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గత నెల 24వ తేదీన విచారణ జరిపిన హైకోర్టు... తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ తీర్పును గురువారం ప్రకటించింది. పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 
 
ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడరాదని, రూ.25 వేల పూచీకత్తుపై రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో హజరై సంతకం చేయాలని, ర్యాలీల్లో పాల్గొనరాదని తదితర షరతులు విధించింది. కాగా, హైకోర్టు తీర్పుపై దళిత, పౌర హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే, ఈ కేసులో వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో సాక్షిగా ఉన్న విషయం తెల్సిందే. అయితే, ఆయన సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు రాకపోవడంతో కోడికత్తి దాడి కేసులో శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరులో తీవ్ర జాప్యం నెలకొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments