Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు భారీ ఊరట...

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (13:09 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరుచేసింది. ఈ కేసులో గత ఐదేళ్ళుగా కోడికత్తి శ్రీను జైలులో మగ్గిపోతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గత నెల 24వ తేదీన విచారణ జరిపిన హైకోర్టు... తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ తీర్పును గురువారం ప్రకటించింది. పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 
 
ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడరాదని, రూ.25 వేల పూచీకత్తుపై రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో హజరై సంతకం చేయాలని, ర్యాలీల్లో పాల్గొనరాదని తదితర షరతులు విధించింది. కాగా, హైకోర్టు తీర్పుపై దళిత, పౌర హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే, ఈ కేసులో వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో సాక్షిగా ఉన్న విషయం తెల్సిందే. అయితే, ఆయన సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు రాకపోవడంతో కోడికత్తి దాడి కేసులో శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరులో తీవ్ర జాప్యం నెలకొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments