Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారుకు షాక్.. జీవో నెం.1 సస్పెండ్.. 20న తుది తీర్పు

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (17:03 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ నెల 20న తుది తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. 
 
ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీచేసిందని ఆయన పేర్కొన్నారు.
 
దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్దంగా ఉందని డివిజన్ బెంచ్ అభిప్రాయపడుతూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. కాగా, జీవో నంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ విపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments