Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమ్మె సైరన్

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (10:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. మొత్తం 9 ప్రధాన డిమాండ్లతో వారు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో వచ్చేనెల రెండో తేదీ అంటే గాంధీ జయంతి రోజు నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని వారు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా, గ్రామ పంచాయతీ ఉద్యోగుల కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలన్నది వారి ప్రధాన డిమాండ్లలో ఒకటిగా వుంది. 
 
అలాగే, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, గ్రీన్ అంబాసిడర్‌లకు కనీస వేతనం ఇవ్వాలని కోరింది. కనీస వేతనంగా రూ.20 వేలు చెల్లించాల్సిన డిమాండ్ చేసింది. నెలకు రూ.6 వేలు చొప్పున అక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరింది. 
 
ముఖ్యంగా, పంచాయతీ కార్మికలను తొలగించడాన్ని తక్షణమే నిలిపి వేయాలని, ఉద్యోగ భద్రతను కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందించాలని ఉద్యోగుల సంఘం కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments