Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వాంతర్యామి పరమశివుడు : చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (12:40 IST)
పరమశివుడు సర్వాంతర్యామి అని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సంబేపల్లె మండలం మోటకట్లలోని శివసాయి రామాలయంలో  జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు గావించారు. ఆలయానికి విచ్చేసిన చీఫ్ విప్‌కు ఆలయ వ్యవస్థాపకులు పివి సుబ్బారెడ్డి కుటుంభ సభ్యులు, ఆలయ పూజారులు ఘనస్వాగతం పలికి ఆయన చేత పూజా కార్యక్రమాలు నిర్వహింపచేశారు. 
 
ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందచేసి దుస్సాలువాతో శ్రీకాంత్ రెడ్డిని సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి నాడు పాటించే జాగరణ నిరంతర చైతన్యానికి, పరిసరాల పట్ల జాగురూతకు సంకేతమన్నారు. మహాశివుని కృషివల్ల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.
 
ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, ఎంపిటిసి అభ్యర్థి కాకులపల్లె రమణారెడ్డి, సంబేపల్లె సర్పంచ్ అంచల రామచంద్ర, వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రతాప్ రెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, హాబీబుల్లా ఖాన్,అబ్బవరం ఆనంద రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మోటకట్ల రెడ్డి, ద్వారక తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments