Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వం ఒక నోట్‌ను తయారు చేసి మంత్రులకు ఆన్‌లైన్‌లో పంపించింది. దీనికి మంత్రులంతా ఆన్‌లైన్‌లో ఆమోదముద్ర వేశారు. ఈ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అధికార నోటిఫికేషన్ నేడో రేపో వెల్లడికానుంది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఒక్కో జిల్లాగా ఏర్పాటుకానున్నాయి. అరకు లోక్‌సభ స్థానాన్ని మాత్రం రెండు జిల్లాలుగా విభజించారు. దీనికి కారణం విస్తీర్ణంలో ఇతర జిల్లాలతో పోల్చితే పెద్దదిగా ఉండటమే. 
 
ఇదిలావుంటే, కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు ఆన్‌లైన్‌లో పంపి వారి ఆమోదం తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇదే అంశంపై జిల్లా కలెక్టర్లతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించారు. తన ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీని రూపొందించిన నివేదికను సమీర్ శర్మ జిల్లాల కలెక్టర్లకు పంపించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్ నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. 
 
ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో అధికారికంగా నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం