Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం : ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ జీవో జారీ!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (11:36 IST)
ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కలుపుతూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏపీ విభజన చట్టం సవరణ మేరకు ఉమ్మడి రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న మండలాలను ఆయా జిల్లాల్లో కలుపుతున్నట్లు ఏపీ రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వు జారీ చేశారు. 
 
ఈ నోటిఫికేషన్ ప్రకారం... బూర్గంపాడు, వేలేరుపాడు, కుక్కునూరు మండల్లోని గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌లోకి వెళతాయి. అలాగే కూనవరం, చింతూరు, వీఆర్ పురం మండలాలు, భద్రాచలం పట్టణం మినహా మిగిలిన భద్రాచలం మండలం మొత్తం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వెళతాయి. 
 
దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు విస్తృత ప్రచారం కల్పించాలని... ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని ఏపీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఆదేశాలు జారీ చేశారు. 30 రోజుల వ్యవధిలో ప్రజల అభ్యంతరాలను పూర్తి స్థాయి నివేదిక రూపంలో రెవెన్యూ శాఖకు అందజేయాలని ఆదేశించారు. 

వరుణ్ సందేశ్ 'నింద' లో ‘సంకెళ్లు’ పాట విడుదల చేసిన గానామాస్ స్పెషల్ స్కూల్ కిడ్స్

జ్యోతిక, సూర్య నిర్మాణంలో కార్తీ, అరవింద్ స్వామి ఫ్రెండ్ షిప్ చిత్రం పేరు మెయ్యళగన్

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

Show comments