Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలందరికీ ఇళ్లు... ఏపీ సర్కారుకు బిగ్ రిలీఫ్

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (16:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలపెట్టిన పేదలందరికీ ఇళ్లు పథకంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో ఏపీలో పేదలందరికీ ఇల్లు నిర్మించేందుకు లైన్ క్లియర్ అయినట్టే. 
 
రాష్ట్రంలో ఇళ్లులేని పేదలు ఉండరాదన్న ప్రధాన ఉద్దేశంతో ఏపీ సర్కారు పేదలందరికీ ఇళ్లు నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే, ఇళ్ళ స్థలాల కేటాయింపుపై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. 
 
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ గత నెల 8వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొంటూ తీర్పునిచ్చింది. దీనిపై హైకోర్టు బెంచ్‌కు ప్రభుత్వం అప్పీల్ చేసింది. 
 
ఈ తీర్పుపై ఏపీ సర్కారు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేశారు. దీంతో ఈ పథకాన్ని ప్రభుత్వం యధావిధిగా కొనసాగించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments