Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామరాజు పచ్చి అబద్దాలకోరు : సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు అఫిడవిట్

Webdunia
గురువారం, 20 మే 2021 (08:10 IST)
తమ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామరాజు పచ్చి అబద్దాలకోరని, ఆయన చెప్పేవన్నీ అసత్యాలేనంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఒక కౌంటర్ అఫిడవిట్‌ను సమర్పించింది. 
 
రాజద్రోహం కేసులో ఏపీ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారనీ, జైలులో చిత్ర హింసలు పెట్టి, కొట్టారని పేర్కొంటూ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో రఘురామరాజు పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీనిపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ వేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్‌లో ఆరోపించింది. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని తెలిపింది వాక్ స్వాతంత్ర్యం పేరుతో హద్దు మీరకూడదని, కానీ రఘురామకృష్ణరాజు అతిక్రమించారని వివరించింది.
 
ప్రజల మధ్యన చీలికలు తెచ్చే ప్రయత్నాలు సరికాదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటనలు, వ్యాఖ్యలు బాగా పరిశీలించాకే కేసు నమోదు చేశామని వివరించింది. రఘురామ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments