Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇంటర్ - పదో తరగతి పరీక్షల టైం టేబుల్ వెల్లడి

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (16:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల టైంటేబుల్‌ను ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే, పదో తరగతి పరీక్షలను మార్చి 18వ తేదీ 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు వరకు నిర్వహిస్తారు. 
 
ఈ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందువల్ల ఈ లోపు రాష్ట్రంలో 10, 12వ తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పరీక్షలను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ముందుగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులంతా కష్టపడి చదివి, విద్యార్థులంతా 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆయన ఆకాక్షించారు. 

 
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న సీఎం కేసీఆర్ 
 
హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ రేపు డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. ఆస్పత్రి నుంచి నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు, కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. రేవు డిశ్చార్జ్ చేస్తున్నామని వెల్లడించారు. 
 
తన ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్‌లో ప్రమాదశాత్తు కాలు జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగిన విషయం తెల్సిందే. యశోద ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్‌ను అమర్చారు. ఆస్పత్రిలో కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, చిన్న జీయర్ స్వామి, ప్రకాశ్ రాజ్ తదితర ప్రముఖులు పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత 6 రోజులుగా ఆయన యశోద ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 
 
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న మహిళకు మూడోసారి గర్భం.. ఎక్కడ? 
 
పిల్లలు పుట్టకుండా ఉండేందుకు మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటారు. అదే పురుషులకు అయితే, వ్యాసక్టమీ శస్త్రచికిత్స చేస్తారు. అయితే, బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ మూడోసారి కూడా గర్భందాల్చింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ గ్రామంలో వెలుగు చూసింది. 
 
ఈ గ్రామంలోని గైఘాట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధిత మహిళ గత 2015లో కు.ని. ఆపరేషన్ చేయించుకుంది. ఆమె భర్త హర్యానాలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ మహిళ ఆర్థిక పరిమితుల కారణంగా ఎక్కువ మంది పిల్ల వద్దనుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు ముందుకు వచ్చింది. 
 
అయితే, తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రెండుసార్లు గర్భందాల్చాలని మహిళ వాపోతుంది. ఇపుడు మళ్లీ మూడోసారి తాను గర్భందాల్చానని తెలిపింది. దీంతో వైద్యులు గర్భవతిని పరీక్షించారు. 
 
కాగా, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాక గర్భందాల్చడంతో 2018వ సంవత్సరంలో జిల్లా మేజిస్ట్రేట్ ఆ మహిళకు ఆరు వేల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు కూడా. ఇపుడు మళ్లీ మరోమారు గర్భందాల్చడం కలకలం సృష్టిస్తుంది. కాగా, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జ్ సివిల్ సర్జన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments