Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలు మృతి పట్ల ఏపి గ‌వ‌ర్న‌ర్ సంతాపం

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (22:06 IST)
చెన్నైలోని ఓ ఆసుపత్రిలో సుదీర్ఘ  కాలంగా చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మృతి చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ మేర‌కు శుక్ర‌వారం రాజ్ భ‌వ‌న్ నుండి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గ‌వ‌ర్న‌ర్ హ‌రించంద‌న్  మాట్లాడుతూ బాల‌సుబ్రహ్మణ్యం కేవలం తెలుగు భాషలోనే కాకుండా దేశం మొత్తం మీద 16 భాషలలో నేపథ్య గాయకునిగా సంగీత అభిమానుల ప్రశంసలు అందుకున్నారని ప్రస్తుతించారు.

ప్రధానంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో ప్రతిభావంతమైన గాయకుడుగా పండిత, పామరులను అలరించారని పేర్కొన్నారు. దివంగత బాల సుబ్రహ్మణ్యం ఒక గాయకుడిగా 40వేల అత్యధిక పాటలను రికార్డ్ చేసినందుకు గిన్నిస్ రికార్డును కూడా కలిగి ఉన్నారని గుర్తు చేసుకున్నారు.

2011లో పద్మ భూషణ్ దక్కించుకోగా, ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 25 నంది అవార్డులు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం... ఇలా అనేక అవార్డులను అందుకున్నార‌ని తెలిపారు. బాలు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఈ సంద‌ర్భంగా బాలు కుటుంబ సభ్యులకు గ‌వ‌ర్న‌ర్ హృదయపూర్వక సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments