Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (14:46 IST)
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని 71వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన నేపధ్యంలో గవర్నర్ మాట్లాడుతూ, భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ వేళ, మోదీ సమర్ధ నాయకత్వంతో  కీలక రంగాలలో అభివృద్ధి పతాక స్దాయికి చేరుకుందన్నారు.
 
చైతన్యవంతమైన నాయకత్వం అందిస్తున్న నరేంద్ర మోదీ వల్లే ఇది సాధ్యపడుతుందన్నారు.  అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ మెరుగుపడిందంటే అది ప్రధాని పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ దీర్ఘాయుష్షును పొంది, మంచి ఆరోగ్యం, ఆనందంతో ఫలవంతమైన జీవితాన్ని పొందాలని తాను కోరుకుంటున్నానన్నారు. 
 
నరేంద్ర మోదీ తన నిర్ణయాత్మక పాత్రతో భరతజాతిని మరింత ఉన్నత స్ధితికి తీసుకెళ్లాలని పూరి జగన్నాథ స్వామి, తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని ప్రార్థిస్తున్నానని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రధానికి సందేశం పంపారు. ఈ క్రమంలో శుక్రవారం రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments