ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ: క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కారు

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (19:49 IST)
కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే వివిధ రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు నిబంధనల్ని కఠినతరం చేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ విధించారంటూ సోషల్ మీడియా వేదికగా కొన్నిరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నిన్నటి నుంచి వాట్సప్ గ్రూపుల్లో నైట్‌ కర్ఫ్యూ వార్త ట్రోల్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. నైట్‌ కర్ఫ్యూపై స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో ఏ విధమైన నైట్‌ కర్ఫ్యూ విధించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
సోషల్ మీడియా వేదికగా ఈ తరహా తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నవారి గురించి ఆరా తీస్తున్నామని తెలిపింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఇటువంటి వార్తల్ని నమ్మవద్దని వెల్లడించారు అధికారులు. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది. వాస్తవానికి జనవరి 8 నుంచి అంటే నేటి నుంచి నైట్‌ కర్ప్యూ విధిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments