Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రాక ఇబ్బందులు

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (15:43 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్ధిక ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా త‌యార‌వుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఒకటో తేదీన జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఈ విష‌యాన్ని గుంటూరులో మీడియాకు తెలిపారు.
 
 
ఉద్యోగులు ఆస్పత్రి వెళ్లేందుకు హెల్త్ కార్డులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సమావేశమైంది. ఇందులో పాల్గొన్న బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కోట్ల రూపాయ‌ల్లో వైద్య బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేద‌ని వివ‌రించారు. 
 
 
గత నెలలోనే పీఆర్సీ అమలు చేయాలని రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామ‌కృష్ణా రెడ్డి చెప్పార‌ని, అయినా ఇప్ప‌టికీ స్పంద‌న లేద‌ని చెప్పారు. ఎన్నికల్లో సీఎం జ‌గ‌న్ ఇచ్చిన హామీలను అమలు చేయాల‌ని, ఆయ‌నే జోక్యం చేసుకొని వెంటనే పీఆర్సీ అమలు చేయాల‌ని డిమాండు చేశారు. నెలాఖరులోగా పీఆర్సీ అమలు కాకపోతే, ఈ నెల 27, 28 తేదీల్లో కార్యాచరణ ప్రకటిస్తామ‌ని, ఇక ఓపిక పట్టే పరిస్థితి లేద‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని బండి శ్రీనివాసరావు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments