Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు తెచ్చి పంచడమే ప్రభుత్వ పనా? : ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్న

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (12:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక నిపుణులతో పాటు... కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారయిందని... పరిస్థితిని చూస్తుంటే చాలా బాధేస్తోందన్నారు. 
 
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైరయిన ఉద్యోగులకు పెన్షన్లు ఆలస్యంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. విశాఖ నగరంలో ప్రభుత్వ భూములు, ఆస్తులను తాకట్టు పెట్టే పరిస్థితిని మనం చూస్తున్నామన్నారు. 
 
ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలన్నారు. సామర్థ్యం ఉన్న నాయకుడు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిపోయాయని... వీటన్నింటిని ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. అప్పులు తీసుకురావడం... వాటిని పంచడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేసే పని అప్పులు తెచ్చి పంచడమేనా? అని ప్రశ్నించారు. ఎంతకాలం అప్పులు పుడతాయని అడిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments