Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెలవెలబోతున్న తాడేపల్లి ప్యాలెస్ : మరికాసేపట్లో సీఎం జగన్ రాజీనామా!!

వరుణ్
మంగళవారం, 4 జూన్ 2024 (14:09 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి మరికొన్ని గంటల్లో రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. మరోవైపు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని కూటమి సునామీ సృష్టించింది. 
 
ఆ కూటమికి చెందిన పార్టీలు ఏకంగా 155 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళుతున్నాయి. ఇందులో టీడీపీ ఏకంగా 131 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, జనసేన పార్టీ 20, భారతీయ జనతా పార్టీ ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇందులో టీడీపీ మూడు స్థానాలు, బీజేపీ ఒక స్థానాల్లో గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించాయి. అలాగే 25 లోక్‌సభ స్థానాల్లో కూడా వైకాపా అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయే పరిస్థితి నెలకొంది. ఆ పార్టీకి చెందిన కేవలం నలుగురు మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. 
 
మరోవైపు, మంగళవారం ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాలతో వైకాపా శ్రేణులు, నేతలు పూర్తిగా డీలా పడిపోయారు. సీఎం జగన్ అధికారిక నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌తో పాటు ఆ పార్టీ ప్రధాన కార్యాలయాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ మినహా ఒక్కరంటే ఒక్క నేత కూడా కంటికి కనిపించడం లేదు. వైకాపా ప్రధాన కార్యాలయం నిర్మానుష్య వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments