Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజీపీగా గౌతం సవాంగ్... కాల్‌మనీ నేతల గుండెల్లో రైళ్లు

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (15:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీ (పోలీస్ బాస్)గా గౌతం సవాంగ్ నియమితులయ్యారు. ఈయన విజయవాడ నగర మాజీ పోలీస్ కమిషనర్. దీంతో విజయవాడతో పాటు దానిపరిసర ప్రాంతాల్లో జరిగిన కాల్‌మనీ దందా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని రాజకీయ పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 
 
ఈ కాల్‌మనీ కేసులో గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అనేక మంది టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, పై స్థాయిలో నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విజయవాడ నగర పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరం గురంచి క్షుణ్ణంగా తెలిసిన గౌతం సవాంగ్ ఇపుడు ఏకంగా డీజీపీగా నియమితులు కావడంతో కాల్‌మనీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల భయంతో వణికిపోతున్నారు. 
 
దీనికితోడు డీజీపీకి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీనిపై గౌతం సవాంగ్ స్పందిస్తూ, తనన నమ్మి డీజీపీగా బాధ్యతలు అప్పగించిన సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. పైగా, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అయితే సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసులు మరింతగా కష్టపడాల్సి వస్తుందన్నారు. 
 
అలాగే, కాల్‌మనీ కేసులపై ఆయన స్పందిస్తూ, విజయవాడలో రెండువేల కాల్‌మనీ కేసులు సెల్‌కు వచ్చాయి. ప్రతి కేసు డిఫరెంట్‌గా ఉంది. కాల్‌మనీలో చాలా కేసులు ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. కాల్‌మనీ కేసుల పరిష్కారంలో బెజవాడ బార్ అసోసియేషన్ సహాకారం మరువలేనిది. ఏకపక్షంగా కొన్ని వర్గాల కోసమే నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉండదన్నారు. 
 
అందరూ సమానమేనని సీఎం జగన్ చెప్పిన మాట అదే. అంతేకాకుండా పోలీసుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. హెల్త్ స్కీమ్‌ను ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఎలక్షన్స్, క్రికెట్ బెట్టింగ్స్ చేసే బుకీలపై దృష్టి పెడతాం. సోషల్ మీడియా అనేది విస్తృతమైన నెట్‌వర్క్.. వాటిలో వాస్తవాలు తెలుసుకొనేందుకు ప్రత్యేక దృష్టిపెడతామని గౌతం సవాంగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments