Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే జరిగితే ఉరివేసుకుంటా : ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి

భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా పెట్టుకుంటుందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రచారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు.

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (14:00 IST)
భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా పెట్టుకుంటుందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రచారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ఇదే అంశంపై ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి సిద్ధం.. ఇది నా వ్యక్తిగతం కాదు.. పార్టీ తరపునే చెప్తున్నా అని వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, జిల్లాలో బీసీలపై కేఈ కుటుంబ పెత్తనమేమీ లేదు. ప్రజల ఆదరణతోనే నేను రాజకీయంగా ఎదిగాను. ధైర్యం ఉంటే నాతో, నా కుటుంబంతో పోటీ చేసి గెలవాలి. నాపై వ్యక్తిగత దూషణలకు దిగడం మానాలని ఆయన హితవు పలికారు. 
 
బీజేపీతో వైసీపీ కుమ్మక్కై రాజీనామాల వ్యవహారాన్ని నాన్చుతున్నారని ఆరోపించారు. బీజేపీ పంచన చేరిన వైసీపీకి 2019లో పుట్టగతులు ఉండవని కేఈ అన్నారు. బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుని కుప్పిగంతులు వేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీని విమర్శించాలని జగన్, పవన్‌ పనిగా పెట్టుకున్నారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments