కోవిడ్-19.. ఏపీలో రోజుకు 7వేల కేసులు.. డీఎడ్ పరీక్షలు వాయిదా..

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:59 IST)
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి జరగాల్సిన డిఎడ్ పరీక్షలను కోవిడ్-19 కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారమైతే... డి.ఈఐ.ఈడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్ 28న జరగాల్సి ఉంది. విద్యాశాఖ అధికారులు అందుకు ఏర్పాట్లు కూడా చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ విజృంభించడంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
రోజూ 7వేల దాకా కొత్త కేసులు వస్తుండటంతో... ఈ పరిస్థితుల్లో ఈ పరీక్షలు జరపడం కష్టమేనని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. తాజా ఆదేశం ప్రకారం ఈ పరీక్షలు మళ్లీ ఎప్పుడు జరిపేదీ తెలపలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ పరీక్షలు జరగబోవని తెలిపింది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,073 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 661458కి పెరిగింది. కొత్తగా 48 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 5606కి చేరింది. కొత్తగా 8,695 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,88,169 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 67,683 యాక్టివ్ కేసులున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments