Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో లీజుకు భవనాలు.. సీఎం జగన్ ఆమోదం

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (20:15 IST)
రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించిన భవనాలను లీజుకు ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఈ మేరకు సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్యోగుల కోసం నిర్మించిన గ్రూప్ డి భవనాలను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా, విట్ యునివర్సిటీకి ఒక భవనాన్ని లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఏడాదికి 8 నుంచి 10 కోట్ల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది. ముందుగా ఒక యూనిట్ భవనాన్ని లీజు ప్రాతిపదికన విట్ యూనివర్సిటీకి ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ఈ మేరకు సంస్థతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
తొలుత ఒక టవర్‌ లీజుకు ఇవ్వాలని ఆ తదుపరి మిగిలిన 5 టవర్‌లు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఒక టవర్‌లోని 120 ఫ్లాట్‌లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భవనాల లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. 
 
గ్రూప్‌ డి కేటగిరీ కింద ఉద్యోగులకు 6 రెసిడెన్షియల్‌ టవర్‌లు నిర్మించారు. సీఆర్​డీఏ 2019 నాటికే 7.76 ఎకరాల విస్తర్ణంలో 720 ఫ్లాట్‌ల నిర్మాణాన్ని ప్రారంభించగా.. 65 శాతం మేర పనులు పూర్తయ్యాయి. అంతా పూర్తైతే మొత్తం 10 లక్షల 22 వేల 149 చదరపు అడుగుల సూపర్‌ బిల్టప్‌ ఏరియా అందుబాటులోకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments