Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలెక్ట్ కమిటీని నియమిస్తావా... చర్యలు తీసుకునేనా... మండలి ఛైర్మన్ హుకుం

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:54 IST)
ఎంతో సౌమ్యుడుగా పేరున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌కు ఆగ్రహం వచ్చింది. మండలి కార్యదర్శిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆదేశాలను పాటించక పోవడంతో మండలి కార్యదర్శిపై గుర్రుగా ఉన్నారు. తన ఆదేశం మేరకు వెంటనే సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దుకు  సంబంధించిన బిల్లులను శాసనమండలి తిరస్కరించిన విషయం తెల్సిందే. పైగా, ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి మండలి ఛైర్మన్ పంపించారు. అయితే, సెలక్ట్ కమిటీకి సంబంధించి చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులు పున:సమీక్షించాలంటూ మండలి కార్యదర్శి ఫైల్‌ను వెనక్కి పంపారు.
 
ఈ చర్య పట్ల షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్ నెంబర్ 154 కింద తనకు సంక్రమించిన విచక్షణాధికారాల మేరకు సెలక్ట్ కమిటీని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓటింగ్ సాధ్యంకాదని స్పష్టం చేశారు. సెలెక్ట్ కమిటీని నియమించి, దానికి సంబంధించి ఫైల్‌ను వెంటనే పంపని పక్షంలో అందులో ఉండే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గత రాత్రి ఈఫైలింగ్ సిస్టం ద్వారా సెక్రటరీకి షరీఫ్ పంపినట్లు సమాచారం. దీంతో తర్వాత జరిగే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments