Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలెక్ట్ కమిటీని నియమిస్తావా... చర్యలు తీసుకునేనా... మండలి ఛైర్మన్ హుకుం

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:54 IST)
ఎంతో సౌమ్యుడుగా పేరున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌కు ఆగ్రహం వచ్చింది. మండలి కార్యదర్శిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆదేశాలను పాటించక పోవడంతో మండలి కార్యదర్శిపై గుర్రుగా ఉన్నారు. తన ఆదేశం మేరకు వెంటనే సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దుకు  సంబంధించిన బిల్లులను శాసనమండలి తిరస్కరించిన విషయం తెల్సిందే. పైగా, ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి మండలి ఛైర్మన్ పంపించారు. అయితే, సెలక్ట్ కమిటీకి సంబంధించి చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులు పున:సమీక్షించాలంటూ మండలి కార్యదర్శి ఫైల్‌ను వెనక్కి పంపారు.
 
ఈ చర్య పట్ల షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్ నెంబర్ 154 కింద తనకు సంక్రమించిన విచక్షణాధికారాల మేరకు సెలక్ట్ కమిటీని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓటింగ్ సాధ్యంకాదని స్పష్టం చేశారు. సెలెక్ట్ కమిటీని నియమించి, దానికి సంబంధించి ఫైల్‌ను వెంటనే పంపని పక్షంలో అందులో ఉండే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గత రాత్రి ఈఫైలింగ్ సిస్టం ద్వారా సెక్రటరీకి షరీఫ్ పంపినట్లు సమాచారం. దీంతో తర్వాత జరిగే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments