Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది ఉద్యోగుల ప్రభుత్వం.. మీరు లేకపోతే నేను లేను : ఏపీ సీఎం జగన్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:25 IST)
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరో తేదీ అర్థరాత్రి నుంచి చేపట్టాలని భావించిన సమ్మెను ఉపసంహరించుకున్నాయి. శనివారం ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటి, ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. 
 
ఈ చర్చలు ఫలించడంతో నిరవధిక సమ్మెను ఉపసంహరించుకున్నారు. ముఖ్యంగా ఆదివారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వం. ఉద్యోగులు లేకపోతే నేను లేను. పీఆర్సీ విషయంలో ఎవరూ భావోద్వేగాలకు పోవద్దని కోరారు. 
 
తాను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని, ఉద్యోగులు లేకపోతే తాను లేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల మద్దతు ఉంటేనే ఏదైనా చేయగలుగుతానని చెప్పారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం అని ఆయన పునరుద్ఘాటించారు. 
 
కరోనా కష్టకాలంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఉద్యోగులు ఆశించిన స్థాయిలో చేయలేకపోయామని, కానీ, చేయగలిగినంత చేశామని చెప్పారు. కానీ భవిష్యత్తులో ఉద్యోగులకు మరెవ్వరూ చేయనంతగా జగన్ చేశాడు అని అనిపించుకుంటానని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments