Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది ఉద్యోగుల ప్రభుత్వం.. మీరు లేకపోతే నేను లేను : ఏపీ సీఎం జగన్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:25 IST)
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరో తేదీ అర్థరాత్రి నుంచి చేపట్టాలని భావించిన సమ్మెను ఉపసంహరించుకున్నాయి. శనివారం ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటి, ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. 
 
ఈ చర్చలు ఫలించడంతో నిరవధిక సమ్మెను ఉపసంహరించుకున్నారు. ముఖ్యంగా ఆదివారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వం. ఉద్యోగులు లేకపోతే నేను లేను. పీఆర్సీ విషయంలో ఎవరూ భావోద్వేగాలకు పోవద్దని కోరారు. 
 
తాను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని, ఉద్యోగులు లేకపోతే తాను లేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల మద్దతు ఉంటేనే ఏదైనా చేయగలుగుతానని చెప్పారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం అని ఆయన పునరుద్ఘాటించారు. 
 
కరోనా కష్టకాలంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఉద్యోగులు ఆశించిన స్థాయిలో చేయలేకపోయామని, కానీ, చేయగలిగినంత చేశామని చెప్పారు. కానీ భవిష్యత్తులో ఉద్యోగులకు మరెవ్వరూ చేయనంతగా జగన్ చేశాడు అని అనిపించుకుంటానని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments