Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల భేటీ

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (13:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆదివారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతోనే మంచి చేయగలుగుతున్నాను. ఆర్థిక కష్టాలు, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ, ఎంతమేరకు మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం అని అన్నారు. ఉద్యోగుల విషయాల్లోకి రాజకీయాలు వస్తే వాతావరణం దెబ్బతింటుందన్నారు. 
 
రాజకీయాలకు తావులేకుండా విధులు నిర్వహించాలని, ఏదేనీ సమస్య ఉంటే అనామలీస్ కమిటీకి విన్నవించుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందన్నారు. ఏ సమస్య ఉన్న వారికి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటే ఉద్యోగులది.. అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా పరిష్కారం చేసుకోవచ్చు అని  చెప్పారు. అంతేకాకుండా, శనివారం మంత్రుల కమిటీ తన ఆమోదంతోనే ఉద్యోగుల డిమాండ్లకు ఆమోదం తెలుపడం జరిగిందని వారితో సీఎం అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments