Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ అల్లుడుగా చంద్రబాబు చేయలేని పని జగన్ చేశారు... ఏంటది?

Webdunia
గురువారం, 30 మే 2019 (13:48 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు అల్లుడుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేయలేని పనిని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించనున్నారు.
 
సినీ రంగాన్ని వదులుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్.టి. రామారావు నెలకు కేవలం ఒక్కటంటే ఒక్క రూపాయి మాత్రమే వేతనం తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా ఒక్కరూపాయి వేతనం తీసుకోలేదు. 
 
చివరకు ఎన్.టి.రామారావు అల్లుడుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా మామ నిర్ణయాన్ని పాటించలేదు. గౌరవించలేదు. కానీ, నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ఆర్ తనయుడు, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. 
 
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. రూ.2.5 లక్షల కోట్ల లోటు బడ్జెట్‌తో సాగుతోంది. దీంతో ప్రభుత్వ ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ మోహన్ రెడ్డి నెలకు కేవలం ఒక్కటంటే ఒక్క రూపాయి మాత్రమే వేతన తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ముఖ్యమంత్రి వేతనం నెలకు రూ.2.50 లక్షలు కాగా, ఇతర అలవెన్సులను కూడా కలుపుకుంటే ఈ మొత్తం కాస్త రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు చేరుతుంది. ఈ ఖర్చును తగ్గించే చర్యల్లో భాగంగా ఆయన ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments