Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఏపీ సీఎం జగన్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (11:29 IST)
పీఎస్ఎల్వీ సీ-52 ఉపగ్రహాన్ని నిర్ధిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం ఉదయం శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ52 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించగా, అది విజయవంతమైంది. దీనిపై సీఎం జగన్ స్పందించారు. 
 
అగ్రదేశాలకు ధీటుగా భారత్‌ను నిలపడంలో ఇస్రో కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలను ఇస్రో మరింత ఇనుమడింపజేసిందని సీఎం జగన్ కొనియాడారు. ఇస్రో ఇకపై కూడా ప్రతి ప్రయోగంలోనూ విజయంవంతంగా కావాలని ఆయన ఆకాంక్షించారు. 
 
పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం విజయవంతం  
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ52 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ-52ను నింగిలోకి దూసుకెళ్ళింది. ఇందుకోసం ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇందులో మొత్తం మూడు ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. 
 
ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ కౌంట‌డౌన్ మొత్తం 25 గంటల 30 నిమిషాల పాటు కొనసాగింది. ఈ ప్రయోగ ప్రక్రియను ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో ఐఆర్ శాట్ 1 ఏ, ఐఎన్ఎస్ 2టీడీ, విద్యార్థులు తయారు చేసిన ఇన్‌స్పైర్ శాట్ 1 ఉపగ్రహాలు ఉన్నాయి. మరోవైపు, ఈ యేడాది మరిన్ని ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతుంది. 
 
ఈ ప్రయోగం ద్వారా కక్ష్యలోకి రి శాట్‌తో పాటు ఇన్‌స్పైర్, ఐఎన్ఎస్ 2టీడీ ఉపగ్రహాలను రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. 
 
వ్యవసాయం, సాగు, అటవీ నీటి వనరులు సమాచారం కోసం ఆర్ ఐశాట్ 1 ఉపగ్రహం భారత్, భూటాన్ దేశాలు కలిసి సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహమే ఐఎన్ఎస్ 2టీడీ అని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments