Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిపై సింగపూర్ ప్రణాళిక.. మార్పులు చేసిన చంద్రబాబు!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (13:56 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని ప్రణాళికలో స్వల్ప మార్పులు చేయాలని సింగపూర్ ప్రభుత్వానికి సూచించారు. రాజధాని ప్రధాన ప్రాంతాన్ని మిగతా నగరాలతో కలుపుతూ రోడ్లు నిర్మించాలని చంద్రబాబు సూచించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా రాజధానిపై ప్రణాళిక సిద్ధమయ్యేలా కనిపిస్తోంది. 
 
సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన వెంట వెళ్లిన బృందానికి నూతన రాజధాని ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం వివరించింది. ఈ సమావేశానికి సింగపూర్ మంత్రులు, ప్రధాన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ప్రణాళికలో కొన్ని మార్పులు చేయాలని చంద్రబాబు సూచించారు. 
 
చంద్రబాబు సూచించిన మార్పులతో మరోసారి ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం రూపొందించబోతోంది. మరో 4 లేదా 6 వారాల్లో రాజధాని ప్రణాళికపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. రాజధాని ప్రధాన ప్రాంతాన్ని మిగతా నగరాలతో కలుపుతూ రహదారులు నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. సోమవారం సింగపూర్ ప్రధానితో చంద్రబాబు సమావేశం కానున్నారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments