Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్: ప్రధానితో భేటీ

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (17:17 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో భేటీకానున్నారు.
 
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. అనంత‌రం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌డ్ ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లువ‌నున్నారని స‌మాచారం.
 
ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు తాడేప‌ల్లి నుంచి బ‌య‌లుదేర‌నున్నారు. రాత్రి 9.15 గంట‌లకు ఢిల్లీ చేరుకుని జ‌న్ ప‌థ్ నివాసంలో బ‌స చేయనున్నారు.

సోమ‌వారం ఉద‌యం ప్రధాని మోదీతో ఆయ‌న భేటీకానున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించనున్నారు.
 
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం వెచ్చించిన రూ. 2,900 కోట్ల నిధులను విడుదల చేయాలని ప్రధానిని జగన్‌ కోరనున్నారు.

అలాగే ముంపు మండలాల్లో జనం పునరావాసానికి నిధులివ్వాల్సిందిగా ప్రధానికి వినతిపత్రం సమర్పిస్తారు. సవరించిన అంచనాల ప్రకారం రూ. 55వేల 548.87 కోట్ల విడుదలకు అనుమతివ్వాల్సిందిగా సీఎం జగన్‌ కోరనున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments