Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్: ప్రధానితో భేటీ

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (17:17 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో భేటీకానున్నారు.
 
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. అనంత‌రం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌డ్ ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లువ‌నున్నారని స‌మాచారం.
 
ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు తాడేప‌ల్లి నుంచి బ‌య‌లుదేర‌నున్నారు. రాత్రి 9.15 గంట‌లకు ఢిల్లీ చేరుకుని జ‌న్ ప‌థ్ నివాసంలో బ‌స చేయనున్నారు.

సోమ‌వారం ఉద‌యం ప్రధాని మోదీతో ఆయ‌న భేటీకానున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించనున్నారు.
 
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం వెచ్చించిన రూ. 2,900 కోట్ల నిధులను విడుదల చేయాలని ప్రధానిని జగన్‌ కోరనున్నారు.

అలాగే ముంపు మండలాల్లో జనం పునరావాసానికి నిధులివ్వాల్సిందిగా ప్రధానికి వినతిపత్రం సమర్పిస్తారు. సవరించిన అంచనాల ప్రకారం రూ. 55వేల 548.87 కోట్ల విడుదలకు అనుమతివ్వాల్సిందిగా సీఎం జగన్‌ కోరనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments