డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. వాహన మిత్ర పథకం కింద..?

Webdunia
బుధవారం, 6 జులై 2022 (12:06 IST)
ఏపీలోని సీఎం జగన్ వాహన డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. 2022-23 సీజన్‌లో కొత్తగా వాహనాలు కొన్న వారికి వాహన మిత్ర పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గత ఆరు నెలల్లో నెలకు సగటున 300 యూనిట్ల విద్యుత్ కంటే ఎక్కువ వాడిన వారు వాహనమిత్ర పథకానికి అనర్హులుగా ప్రభుత్వం తేల్చి చెప్పింది.
 
ఈ పథకం కింద ఏటా రూ. పదివేలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, భూమి వివరాలు, ఆదాయపన్ను, విద్యుత్ వినియోగం, కులం వంటి వివరాలతో కూడిన పత్రాలను స్థానిక గ్రామ సచివాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది.
 
ఆరు అంచెల్లో దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అర్హుల జాబితాను ప్రకటిస్తారు. అర్హులైనప్పటికీ జాబితాలో పేరు లేనట్టయితే వారికి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. 
 
అర్హులైన లబ్దిదారుల జాబితాను ఎంపీడీవో లేదా మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ నెల 9లోగా ఆమోదించి 10న కలెక్టరుకు వివరాలు ఇస్తారు. తర్వాత 11,12 తేదీల్లో సంబంధిత కార్పొరేషన్‌కు పంపిస్తారు. తర్వాత వాటిని పరిశీలించి అర్హులకు ఆర్దిక సహాయం చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments