Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడబిడ్డల జోలికి వెళ్తే ఊరుకునే ప్రసక్తే లేదు.. బాబు వార్నింగ్

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (08:11 IST)
దేశంతో పాటు ఏపీలోనూ మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే వారికి అదే ఆఖరి రోజు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం గుంటూరులో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. దీపం పథకం ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామనీ, మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడామన్నారు.
 
మహిళా సాధికారత అంటే ఏంటో తాను ఇంట్లో చేసి చూపానని చంద్రబాబు తెలిపారు. దాదాపు 27 ఏళ్ల క్రితం డైరీ పరిశ్రమను ప్రారంభించామని గుర్తుచేసుకున్నారు. తన భార్య భువనేశ్వరి కృషితో ఆ సంస్థను విజయవంతంగా నడుపుతున్నామని అన్నారు.
 
అన్న అమృత హస్తం ద్వారా గర్భిణులకు ఒకపూట భోజనం పెడుతున్నామని, సామూహిక సీమంతాలకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలోనే కోటి మంది డ్వాక్రా మహిళలకు మొబైల్‌ ఫోన్లు ఇస్తామని చెప్పారు.
 
ఏపీలో మహిళలు తయారుచేసిన వస్తువులకు మార్కెటింగ్‌ కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంగన్‌వాడీల్లో పనిచేసేవారికి ప్రతి నెలా రూ.10,500 వేతనం అందిస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments