Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు అమరావతి శంకుస్థాపన ఇన్విటేషన్ : చంద్రబాబే ఇస్తారా?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (13:19 IST)
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అందజేయనున్నారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు ఏవిధంగా అయితే, ఆహ్వాన లేఖలు పంపనున్నారో అదేవిధంగా కేసీఆర్‌కు కూడా ఆహ్వాన పత్రికను పంపాలని తొలుత భావించారు. అయితే, కేసీఆర్, చంద్రబాబు నాయుడులు హైదరాబాద్‌లోనే ఉండటం వల్ల నేరుగా ఇవ్వడమే సముచితమని భావిస్తున్నారు. 
 
కాగా, దసరా పండుగ రోజున నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుగనున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి లక్ష మందిని ఆహ్వానించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రులందరికీ ఆహ్వాన పత్రాలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలో  బద్దశత్రవుగా మారిన కేసీఆర్‌కు బాబు ఆహ్వానం పంపుతారా లేదా అనేదే ఇపుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. 
 
దీనికి కారణం లేకపోలేదు. గతంలో గవర్నర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకే ఒకరితో ఒకరు కలవకుండా డుమ్మా కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వైఖరి ఎలా ఉండబోతుంది? ఆహ్వానం వస్తే కేసీఆర్ ఎలా స్పందిస్తారనేదానిపైనే సర్వత్రా చర్చ జరిగింది. అందరి సీఎంలతో  పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సైతం ఆహ్వాన పత్రికను పంపాలని భావించినప్పటికీ... చంద్రబాబు మాత్రం స్వయంగా వెళ్లి ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments