Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగస్వామి నాయుడుకి చంద్రబాబు సంతాపం(వీడియో)

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని శాంతిపురం మండలం తుమ్మిసి హెలిప్యాడ్‌కు గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర బాబు, గిరీషా తదితరులు స్వాగతం పలికారు. బ

Webdunia
గురువారం, 13 జులై 2017 (21:36 IST)
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని శాంతిపురం మండలం తుమ్మిసి హెలిప్యాడ్‌కు గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర బాబు, గిరీషా తదితరులు స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చారు. శాంతిపురంలో మాజీ దివంగత మాజీ శాసనసభ్యులు రంగస్వామి నాయుడు గృహానికి విచ్చేశారు. 
 
రంగస్వామి నాయుడు చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు రంగస్వామి నాయుడు భార్య హేమావతి, మొదటి కుమారుడు హేమాద్రి నాయుడు, పెద్ద కోడలు సునీత, రెండవ కోడలు సునీత, మనవళ్లు లిఖిత్, వినీత్, కౌశిక్‌లను పరామర్శించి రంగస్వామి నాయుడుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 
 
వారి కటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత రంగస్వామి నాయుడు సర్పంచిగా, సమితి వైస్ ప్రెసిడెంటుగా, ఎమ్మెల్యేగా, ఏడిబి బ్యాంక్ ప్రెసిడెంట్, ఆర్టీఏ మెంబర్, టిటిడి బోర్డు మెంబరుగా వివిధ పదవులలో ప్రజలకు ఎనలేని సేవ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments