Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదుల అనుసంధానం తప్పనిసరి : చంద్రబాబు డిమాండ్

Webdunia
ఆదివారం, 23 నవంబరు 2014 (11:08 IST)
రాష్ట్రంలోని నదులను అనుసంధానించడం తప్పనిసరిగా చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నదుల అనుసంధానం అనే అంశంపై జరిగిన ‘జల మంథన్’ సదస్సులో వ్యాఖ్యానించారు.
 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నదుల అనుసంధానం అంశం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతున్నాయన్నారు. నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు నదుల అనుసంధానం తప్పనిసరి అన్నారు. 
 
కొన్ని దేశాలలో అయితే ఏకంగా సముద్రపు నీటినే మంచినీరుగా మార్చుకుంటున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితిలో నీటి నిర్వహణ మరింత జాగ్రత్తగా వుండాలి. 
 
రాష్ట్రంలో ఉన్న గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, పలువురు ఉన్నతాధికారులు, నీటి పారుదల రంగ నిపుణులు, తదితరులు పాల్గొన్నారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments