Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పం పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు...ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు...

వరుణ్
శుక్రవారం, 21 జూన్ 2024 (11:00 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26వ తేదీల్లో కుప్పం నియోజవర్గానికి వెళ్లనున్నారు. మొత్తం రెండు రోజుల పాటు ఆయన తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కుప్పంలో పర్యటించనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
తన పర్యటనలో భగాంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను ఆయన కలుసుకుంటారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించిన టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపనున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వ సారి విజయం సాధించారు. నాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు 1989 నుంచి వరుసగా, తనకు ఎదురులేని రీతిలో తన ఎమ్మెల్యే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 
 
కొడాలి నానిపై వలంటీర్ల ఫిర్యాదు.. కేసు నమోదు..
 
వైకాపా ప్రభుత్వంలో బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు పలువురు వలంటీర్లపై వైకాపా నేతలు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేయించిన విషయం తెల్సిందే. ఇలాంటి వారంతా మళ్ళీ తమను విధుల్లోకి చేర్చకోవాలని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి ప్రాధేయపడుతున్నారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వలంటీర్లు బిక్కమొహం వేస్తున్నారు. అంతేకాకుండా, ఒత్తిడి చేయించి రాజీనామాలు చేయించిన వారిపై ఫిర్యాదు చేయాలని టీడీపీ నేతలు సలహాలు ఇస్తున్నారు. 
 
దీంతో అనేకమంది వలంటీర్లు వైకాపా నేతలపై ఫిర్యాదులు చేస్తున్నారు. తమను వేదించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైకాపా అధ్యక్షుడు గొర్ల శ్రీను, మరో ఇద్రు వైకాపా నేతలపై 447, 506 సెక్షన్ల కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
మాట నిలబెట్టుకున్న జనసేనాని.. తొలి సంతకం అదే.. 
 
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆయన ఇచ్చిన మాట మేరకు ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరుపై తొలి సంతకం చేశారు. అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు. 
 
ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దానికంటే ముందుగా విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సచివాలయంలోని తన చాంబర్‌కు వచ్చిన ఆయన ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. 
 
కాగా, ఏపీ డిప్యూటీ సీఎంగా, వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. మంత్రులు, నాదెండ్ల భాస్కర్ రావు, కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ళ ఉదయ్ కుమార్, ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రసాద్ యాదవ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ తదితరులు పాల్గొన్నారు. 
 
గత 2019లో ఆయన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. మహిళా దినోత్సవం రోజును పురస్కరించుకుని రైతులకు జనసేన ఇస్తున్న మాట ఇది. రైతు ఆడపడుచుల విన్నపాలు అందిన తర్వాత వచ్చిన ఆలోచన ఇది అని  2019 మహిళా దినోత్సవం రోజున ఆయన జనసేనాని మాట ఇచ్చారు. ఇపుడు ఆ మాటను ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజునే నిలబెట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments