Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడుకొండలు ఇంటిలో కాఫీ తయారు చేసిన సీఎం చంద్రబాబు (Video)

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (15:05 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ లబ్దిదారుడు ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేశారు. ఆ తర్వాత ఆ కాఫీని ఆయన సేవించడంతో పాటు ఆ లబ్దిదారుడు కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చారు. ఆ తర్వాత వారికి నెలవారి పెన్షన్ సొమ్మును పంపిణీ చేశారు. ఒకటో తేదీకి ఒక రోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను మంగళవారం పంపిణీ చేసిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన పల్నాడు జిల్లాలో జరిగిన పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 66,77,943 మంది లబ్దిదారులకు పింఛన్ల కోసం రూ.2717 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పింఛన్ల పంపిణీ మంగళవారం మధ్యాహ్నానికి 90 శాతం మేరకు పూర్తి చేశారు. 
 
ఈ పింఛన్ల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా యలమందలో ఆయన పర్యటించి, శారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆమె భర్త చనిపోయారు. వారి కుటుంబ పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ చదువుతున్న శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ షాపు పెట్టుకుంటానన్న ఆమె కుమారుడుకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష రుమం, మరో రూ.2 లక్షలు సబ్సీడీగా ఇప్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments