Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడుకొండలు ఇంటిలో కాఫీ తయారు చేసిన సీఎం చంద్రబాబు (Video)

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (15:05 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ లబ్దిదారుడు ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేశారు. ఆ తర్వాత ఆ కాఫీని ఆయన సేవించడంతో పాటు ఆ లబ్దిదారుడు కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చారు. ఆ తర్వాత వారికి నెలవారి పెన్షన్ సొమ్మును పంపిణీ చేశారు. ఒకటో తేదీకి ఒక రోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను మంగళవారం పంపిణీ చేసిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన పల్నాడు జిల్లాలో జరిగిన పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 66,77,943 మంది లబ్దిదారులకు పింఛన్ల కోసం రూ.2717 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పింఛన్ల పంపిణీ మంగళవారం మధ్యాహ్నానికి 90 శాతం మేరకు పూర్తి చేశారు. 
 
ఈ పింఛన్ల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా యలమందలో ఆయన పర్యటించి, శారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆమె భర్త చనిపోయారు. వారి కుటుంబ పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ చదువుతున్న శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ షాపు పెట్టుకుంటానన్న ఆమె కుమారుడుకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష రుమం, మరో రూ.2 లక్షలు సబ్సీడీగా ఇప్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments