Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేమిటి : మంత్రి భరత్‌కు సీఎం వార్నింగ్!!

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (22:17 IST)
ఏపీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌కు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నవ్యాంధ్రకు పెట్టుబడులే ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని ప్రత్యేక బృందం దావోస్‌లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌‍లోని జ్యూరిచ్‌ నగరంలో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖామంత్రి టీజీ భరత్ ప్రసంగిస్తూ, భవిష్యత్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేశ్ గారే అంటూ వ్యాఖ్యానించారు. ఎవరు కాదన్నా ఇది జరిగితీరుతుందన్న కోణంలో వ్యాఖ్యానించారు. 
 
ఇదే వేదికపై ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ మాటలు విని ఆగ్రహోద్రుక్తుడయ్యారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఇలాంటి వేదికలపై మాట్లాడొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు.. మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేమిటి.. అసందర్భం ప్రసంగాలు చేయొద్దని మందలించారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మరోమారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌తో పాటు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments