Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినకు వెళుతున్న ఏపీ సీఎం చంద్రబాబు... విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలు!

వరుణ్
మంగళవారం, 16 జులై 2024 (08:53 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఢిల్లీకి వెళుతున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రికి దేశ రాజధానిలోనే బస చేసే ఆయన బుధవారం ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశంకానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య గత దశాబ్దకాలంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాలని కోరనున్నారు. అలాగే, ఇతర రాజకీయ అంశాలతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకు... విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు తదితర అంశాలను కూడా ఆయన ప్రస్తావించనున్నారు. 
 
కాగా, ఈ నెల 3న ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు అక్కడే ఉండి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన విషయం తెల్సిందే. ఇపుడు మళ్లీ కేవలం 15 రోజుల వ్యవధిలో ఢిల్లీకి వెళ్లనుండటం గమనార్హం. ఇదిలావుంటే, మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులందరూ పాల్గొననున్నారు. ఈ సమావేశం ముగించుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments