Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నగరాన్ని భ్రష్టు పట్టించారు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

విజయవాడ : విజయవాడలో జ‌రుగుతున్న‌ అభివృద్ధి పనుల్లో భాగంగా బుధ‌వారం ఇన్నర్ రింగ్ రోడ్డును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గత పాలకుల నిర్వాకం వల్ల ఇన్నర్ రింగ్‌ రోడ్డు పనులు నాసిరకంగా జరిగాయని, వారి నిర్లక్ష్యంతో విజయవాడ పరిస్థితిని చూస్తే గుం

Webdunia
బుధవారం, 27 జులై 2016 (20:29 IST)
విజయవాడ : విజయవాడలో జ‌రుగుతున్న‌ అభివృద్ధి పనుల్లో భాగంగా బుధ‌వారం ఇన్నర్ రింగ్ రోడ్డును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గత పాలకుల నిర్వాకం వల్ల ఇన్నర్ రింగ్‌ రోడ్డు పనులు నాసిరకంగా జరిగాయని, వారి నిర్లక్ష్యంతో విజయవాడ పరిస్థితిని చూస్తే గుండె తరుక్కుపోయిందన్నారు. అమరావతికి కేంద్ర బిందువు విజయవాడని చంద్రబాబు చెప్పారు. దుర్గమ్మ ఫ్లైఓవర్‌ను త్వరలోనే పూర్తిచేస్తామని చంద్రబాబు తెలిపారు. మచిలీపట్నం రహదారి నిర్మాణ పనులు, బెంజి సర్కిల్‌ ఫ్లైవోవర్ పనులను త్వరలో ప్రారంభిస్తామని చంద్రబాబు అన్నారు. 
 
విజయవాడ నగరాన్ని భ్రష్టుపట్టించారని చంద్రబాబు ఆరోపించారు. రామవరప్పాడు నుంచి నుంచి గొల్లపూడి వరకు 9.84 కిలోమీటర్ల మేర రెండు హైవేలను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి రావడంతో  హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలను  మళ్లించనున్నారు. కేవలం 18 నెలల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశామని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల ట్రాఫిక్ సమస్య తీరడమే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు. 
 
అలాగే పాత విజయవాడ వేరు.. అభివృద్ధి చెందుతున్న విజయవాడ వేరని చంద్రబాబు అన్నారు. స్పీడ్ క్యాపిటల్‌కు ఇన్నర్ రింగ్ రోడ్లను అనుసంధానం చేస్తామని తెలిపారు. అలాగే కృష్ణా పుష్కరాల గురించి కూడా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు పుష్కరాలకు వచ్చే భక్తులను బంధువుల్లా ఆదరించాలని బెజవాడ ప్రజలకు సూచించారు.

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments