Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వరద బాధిత ప్రాంతాల్లోని వాహనదారులకు శుభవార్త!!

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (13:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న వాహనదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ శుభవార్త చెప్పారు. వరదలో మునిగిన వాహనాల మరమ్మతు ఖర్చులను గణనీయంగా తగ్గించాలని కోరారు. ఈ మేరకు బ్యాంకర్లు, బీమా కంపెనీల మేనేజర్లు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో వాహనదారుల క్లెయింలను వేగంగా పరిష్కరించాలని, మరమ్మతుల భారం తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
ఇప్పటికే సర్వం కోల్పోయిన వరద బాధితలకు వాహనాల మరమ్మతులు పెనుభారంగా మారకుండా చూడాలని కోరారు. మరమ్మతుల ఖర్చులు తగ్గేలా చూడాలని కోరారు. నీట మునిగిన వాహనాలు, కొట్టుకుపోయిన వాహనాలకు సంబంధించిన క్లెయింలను వేగంగా పరిష్కరించి బాధితులను ఆదుకోవాలని  కోరారు. ప్రభుత్వంతో కలిసి బాధితులను ఆదుకునేందుకు బ్యాంకర్లు, బీమా కంపెనీలు ముందుకు రావాలని ఆయన కోరారు. నిబంధనలు, కొన్ని సడలింపులు చేసి ప్రజలకు కొత్త రుణాలను మంజూరు చేయాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో క్లెయింల దరఖాస్తుకు అవకాశం కల్పించాలని బ్యాంకులు, బీమా కంపెనీల ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments