Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ పతనానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ : చంద్రబాబు జోస్యం

ప్రధాని నరేంద్ర మోడీ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలతో ఈ విషయం తేటతెల్లమైందని గుర్తుచేశారు.

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (04:50 IST)
ప్రధాని నరేంద్ర మోడీ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలతో ఈ విషయం తేటతెల్లమైందని గుర్తుచేశారు. ప్రధాని మోడీ ప్రతిష్ఠ మసకబారుతోందనడానికి ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.
 
గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో తొలుత మాట్లాడింది టీడీపీయే. ఇప్పుడు బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ కూడా కమలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు' అని వ్యాఖ్యానించారు. 
 
ఉప ఎన్నికల ఫలితాల ద్వారా మాటలు చాలు, పని మొదలుపెట్టండనే సంకేతాన్ని ప్రజలు మోడీకి ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సిట్టింగ్‌ స్థానాలను కూడా కాపాడుకోలేకపోవడం... మోడీకి తగ్గిన ఆదరణకు నిదర్శనమని అన్నారు. ఈ పతనానికి పునాది వేసింది మనమే అని మంత్రులతో వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments