జగన్‌కు అంత సీన్ లేదు... చివరి అస్త్రంగా అవిశ్వాసం : చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర హక్కులను సాధించుకునేంత సీన్ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి లేదని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (09:04 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర హక్కులను సాధించుకునేంత సీన్ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి లేదని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేసులకు భయపడి కేంద్రానికి భజన చేస్తున్నారంటూ మండిపడ్డారు. అదేసమయంలో తాము ఎన్డీయే నుంచి వైదొలిగితే ఆయన అక్కడ చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. 
 
మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ, ఎంపీలు తక్కువగా ఉన్న కారణంగా మనం అవిశ్వాస తీర్మానం పెట్టలేమ‌ని, అయితే, అవసరమైతే అన్ని పార్టీల సాయం తీసుకుని అవిశ్వాసం దిశగా వెళతాన‌ని అన్నారు. కానీ, అది చివరి ప్రయత్నంగా మాత్ర‌మే ప్రయోగించాలని చెప్పారు.
 
అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 54 మంది ఎంపీలు ఉండాలన్నారు. తాను అవిశ్వాస తీర్మానం వల్ల లాభం లేదని అన్నానని కొందరు అంటున్నారని, తాను అలా అనలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అన్ని పోరాటాలు చేసిన తరువాత ఆ ప్ర‌య‌త్నం చేయాల‌ని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తారో ప్యాకేజీ నిధులు ఇస్తారో కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments