విజయవాడ: అమరావతికి, జపాన్ దేశానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని... నవ్యాంధ్రకు ఇకపై జపనీయులు తరచూ వచ్చి వెళుతుంటారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దీనికోసం సమీప భవిష్యత్తులో అమరావతి నుంచి టోక్యోకు నేరుగా విమాన సర్వీసులు ఏర్పాటవుతాయని చెప్పారు. విజయవాడలో సీఎం చంద్రబాబు జపాన్ విదేశీ వాణిజ్య సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా డెలిగేషన్ను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచే చైనా, జపాన్ దేశాలకు బౌద్ధ ధర్మం వ్యాప్తి చెందిందన్నారు. ఏపీలో సుదీర్ఘమైన తీరప్రాంతం ఉందని, అపారమైన సహజవనరులున్నాయని... వాటిని సద్వినియోగం చేసుకోవడానికి విదేశీ సహకారాన్ని కోరుతున్నామన్నారు.