Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు కేసీఆర్‌‍ను బూతులు తిట్టి... నేడు అదే తప్పు చేసిన చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని తేలిపోయింది. నలుగురికి నీతులు చెప్పే చంద్రబాబు.. చివరకు ఆ నీతికి, నైతిక విలువలకు కట్టుబడేందుకు ప్రయత్నం చేయడం లేదు.

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (12:29 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని తేలిపోయింది. నలుగురికి నీతులు చెప్పే చంద్రబాబు.. చివరకు ఆ నీతికి, నైతిక విలువలకు కట్టుబడేందుకు ప్రయత్నం చేయడం లేదు. ముఖ్యంగా రాజకీయాల్లోనే కాడుండా వ్యక్తిగతంగా కూడా విలువలు పాటించే విషయంలో తాను ఎప్పుడూ ముందుంటానని, ఈ విషయంలో ఎవరినైనా ప్రశ్నిస్తానని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తాజాగా ఆ విలువలకు తిలోదకాలిచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గంలోకి టీడీపీ నుంచి తెరాసలోకి వెళ్లిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తీసుకున్నారు. దీన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే అంశంపై టీ టీడీపీ న్యాయపోరాటం కూడా చేస్తోంది. ఇపుడు ఇదే తప్పు చంద్రబాబు చేశారు. వైకాపా నుంచి టీడీపీలో చేరిన వారిలో నలుగురు జంప్ జిలానీలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. 
 
తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో అప్పట్లో గవర్నర్‌పైనా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు, పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. పార్టీలో సమర్థులే లేరా, ఫిరాయింపు ఎమ్మెల్యేలే దొరికారా? అప్పుడు విమర్శించిన వారికి ఇప్పుడు పదవులా అని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments