Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన ఎంపీ కాదు.. విజిటింగ్ ప్రొఫెసర్ : బీజేపీ ఎంపీలు సెటైర్లు

లోక్‌సభ వేదికగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించిన అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌పై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు.

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (20:52 IST)
లోక్‌సభ వేదికగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించిన అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌పై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఎంపీ కాదనీ, విజిటింగ్ ప్రొఫెసర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 
తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి అన్యాయం జరిగిన విషయమై లోక్‌సభలోజయదేవ్ ఇటీవల ఘాటుగా ప్రసంగించడం తెలిసిందే. పార్టీ శ్రేణులు ఆయన్ని అభినందనలతో ముంచెత్తడమేకాకుండా, ఏపీలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జయదేవ్‌ను ఘనంగా సన్మానించారు కూడా. 
 
ఈ విమర్శలను జీర్ణించుకోలేని బీజేపీ నేతలు గల్లా జయదేవ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ గల్లా జయదేవ్ ఏం సాధించారని ఆయనకు సన్మానం చేశారో అర్థం కావడం లేదని విమర్శించారు.
 
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి నేతృత్వం వహించే ఆయన్ని 'విజిటింగ్ ప్రొఫెసర్' అని ప్రజలు పిలుస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ పార్టీ నేతలకు మాట్లాడే అవకాశమొస్తే అంతకంటే బాగా మాట్లాడతారని, తమతో పొత్తు తెంచుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments