Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ తరపున గెలిచి వైకాపాలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు

వరుణ్
శుక్రవారం, 26 జనవరి 2024 (17:36 IST)
తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైకాపా పంచన చేసి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ కార్యాలయం నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులు పంపించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు అయిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్‌లు ఉన్నారు. 
 
వీరంతా గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి, వైకాపా చెంతన చేరారు. ఆ తర్వాత వైకాపా ఎమ్మెల్యేలుగా చెలామణి అయ్యారు. అయితే, ఈ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ టీడీపీ విప్ డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి స్పీకర్‌కు లేఖ రాసి, అనర్హులుగా ప్రకటించాలని కోరారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయం కోరింది. పార్టీ నిర్ణయం మేరకు అనర్హత పిటిషన్ ఇచ్చామని, ఆ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. 
 
ఈ క్రమంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం నోటీసులు జారీచేశారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం విచారణకు హాజరుకావాలని, వారి వివరణ అందజేయాలని ఆ నోటీసుల్లో స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments