Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ తరపున గెలిచి వైకాపాలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు

వరుణ్
శుక్రవారం, 26 జనవరి 2024 (17:36 IST)
తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైకాపా పంచన చేసి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ కార్యాలయం నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులు పంపించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు అయిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్‌లు ఉన్నారు. 
 
వీరంతా గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి, వైకాపా చెంతన చేరారు. ఆ తర్వాత వైకాపా ఎమ్మెల్యేలుగా చెలామణి అయ్యారు. అయితే, ఈ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ టీడీపీ విప్ డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి స్పీకర్‌కు లేఖ రాసి, అనర్హులుగా ప్రకటించాలని కోరారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయం కోరింది. పార్టీ నిర్ణయం మేరకు అనర్హత పిటిషన్ ఇచ్చామని, ఆ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. 
 
ఈ క్రమంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం నోటీసులు జారీచేశారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం విచారణకు హాజరుకావాలని, వారి వివరణ అందజేయాలని ఆ నోటీసుల్లో స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

వేశ్యగా మారిన సినీ నటి అంజలి..? ఎందుకోసమంటే..

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

తర్వాతి కథనం
Show comments